సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులకు తగిన న్యాయం చేస్తాం
- బాధితులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది
మంగళగిరి, బ్రహ్మనందపురంలో సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులను కలిసిన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు. కొన్ని రోజుల క్రితం తాడేపల్లి, బ్రహ్మానందపురం వాసులు తమ సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియజేయాలని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలసి వినతి పత్రం అందించడం జరిగింది. బ్రహ్మానందపురంలోని సిమెంట్ ఫ్యాక్టరీ బాధితుల ఇళ్ళను శనివారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారితో స్థానికులు మాట్లాడుతూ ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని ఇక్కడ గతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ నాటి నుంచి ఇక్కడే తమ పూర్వీకులు కూడా ఉండే వారని నాటి నుంచి ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని ప్రస్తుత మీరైనా తమ భాధలను పరిష్కారం కావాలని మీరైనా మాకు న్యాయం చేయాలని కోరారు. అనేక అంశాలపై స్థానికలు వారి మనోభావాలు తెలియజేశారు. తమకు చేతనైనంత వరకు మీకు న్యాయం చేస్తానని చిల్లపల్లి శ్రీనివాసరావు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-24-at-17.40.32-1024x768.jpeg)