ప్రజా సమస్యలపై ఎంపీడీఓకు ఆదోని జనసేన వినతి పత్రం
ఆదోని: కర్నూలు జిల్లా, ఆదోని జనసేన పార్టీ ఇంచార్జి యన్.మల్లప్ప ఆధ్వర్యంలో జరిగిన గ్రామాల పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో 7 రోజుల పాటు బైకు ర్యాలీ నిర్వహించి ఆ..యా గ్రామాల సమస్యలపై ఎంపీడీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పేరుకుపోయిన చేత్త తొలగింపు, శుద్దిచేయబడిన నీటి సరఫరా, కాలువల పూడిక తొలిగించటం, మంచి నీటి పైప్ లైన్ల నిర్మాణం లాంటి సమస్యలపై ఎంపీడీఓ కి జనసేన పార్టీ తరపున విన్నవించటం జరిగింది. ఈ వినతి పత్రం పై సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ ప్రతి సమస్యను పరిష్కరించేలా పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రేణువర్మ, తహర్వాలి, వెంకటేష్ తదిపర నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-20-at-3.10.22-PM-1024x768.jpeg)