మల్టీస్టారర్ గా ప్రేక్షకులముందుకు అల్లుడు అదుర్స్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `అల్లుడు అదుర్స్‌`. ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఒకట్రెండు రోజుల్లో ట్రైలర్ కూడా చూపించేయబోతున్నారు. సోనూసూద్ కి ఈ సినిమాలో కీలకమైన పాత్ర దక్కింది. ముందు విలన్ గా సోనూసూద్ ని ఎంచుకున్నారు. అయితే కరోనా తరవాత.. సోనూ రియల్ హీరో అయ్యాడు. దానికి తగ్గట్టే.. ఈ సినిమాలో సోనూ సూద్ పాత్ర రూపు రేఖల్ని మార్చేశారు. నెగిటీవ్ పాత్ర నుంచి పాజిటీవ్ పాత్రగా తీర్చిదిద్దారు. పాటల్లోనూ.. సోనూసూద్ కనిపించబోతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే.. అల్లుడు అదుర్స్‌ని మల్టీస్టారర్ చేసేశారు. లాక్ డౌన్‌తరవాత.. స్క్రిప్టులో కొన్ని కొత్త సీన్లు రాసి.. వాటిలో సోనూసూద్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ట్రైలర్ లో కూడా సోసూకి స్కోప్ ఎక్కువ ఇచ్చేలా చేస్తున్నారు. సోనూ సినిమా అంటే. ప్రేక్షకులు పాజిటీవ్ కోణంలో చూస్తారన్న ఆలోచన చిత్రబృందానిది. అందుకే.. ఈ సినిమాని కాస్త మల్టీస్టారర్ చేసేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *