ఎపిలో నకిలీ మందులు తయారు చేస్తున్న ఏజెన్సీలు సీజ్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో నకిలీ మందుల విక్రయాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మందుల ముఠాను చేధించేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని డ్రగ్స్ ఐజి రవిశంకర్ నారాయణను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. దీంతో కొన్ని టీంలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ డ్రగ్స్ సంస్థలపై సోదాలు నిర్వహించారు. విజయవాడలో హరిప్రియ ఫార్మా ఏజెన్సీ, పాలకొల్లులో లోకేశ్వరీ మెడికల్ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. ఇక్కడ పెద్ద మొత్తంలో నకిలీ మందులను గుర్తించిన అధికారులు… ఈ రెండు ఏజెన్సీలను సీజ్చేశారు. చండీఘర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా నకిలీ మందుల రాకెట్ నడుస్తున్నట్లు గుర్తించారు.