ఆక్వా రైతులను ఆదుకోవాలి.. జనసేన వినతి పత్రం

తణుకు: ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంగుటూరు నియోజకవర్గం ఇంచార్జ్ పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో గణపవరం సెంటర్ నుండి గణపవరం తాసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ ఇన్చార్జి విడివాడ రామచంద్ర రావు, తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు టౌన్ నాయకులు పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.