గోవధపై జనసేనానికి ఆకుల ఉమేష్ వినతి

హిందూపురం, పట్టణ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో గోవులను వధించి మాంసాన్ని బెంగళూరు మరియు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా ఇక్కడి అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గోవులను వధించే పరిసర ప్రాంతాలు మొత్తం రక్తంతో, ఎముకలతో దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ఈ విషయాన్ని జనసేన పార్టీ హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కి వివరించడం జరిగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.