పేర్ని నానీకి అళహరి సుధాకర్ స్ట్రాంగ్ కౌంటర్

కావలి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పేర్ని నానీ అనుచిత వ్యాఖ్యలను కావలి ఇంఛార్జి అళహరి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కావలి జనసేన కార్యాలయంలో అళహరి సుధాకర్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సుధాకర్ నాయకులతో కలిసి పేర్నినానిపై ద్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాహి మొదటి సభ జయప్రదం కావడంతో తట్టుకోలేక వైసీపీ పార్టీ తాడేపల్లి నుండి ఇచ్చిన స్క్రిప్ట్ ను బందరు పిచ్చికుక్క రెండు చెప్పులు చూపిస్తూ మాట్లాడారని. నిన్ను నువ్వు అనుకున్నట్లు విశ్వాసం గల కుక్క, పాలేరు తనము చూపించాల్సింది జగన్ మీద కాదు, నీ బందరు ప్రజలమీద చూపించు. అంతే కానీ పవన్ కళ్యాణ్ గారిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్డార్ అని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వేంకట సుబ్బయ్య, టౌన్ ప్రెసిడెంట్ పోబ్బా సాయి, కావలి అధికార ప్రతినిధి రిషికేష్, బెల్లంకొండ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాపుల నాయకుడిని కాపుల చేత తిట్టిపిస్తే ఈసారి కాపుల ఓట్లు వైసీపీకి వస్తాయి అనుకోవడం జగన్ భ్రమ అని, జగనన్న మెప్పుకోసం రేపు నీ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడని కుక్కలాగా మోరిగినా ప్రయోజనము ఉండదని అన్నారు. ఈ కార్యక్రమములో శరణ్, ఆలా శ్రీనాథ్, మని, రవి కుమార్, మస్తాన్, ప్రవీణ్, తాసిఫ్, రామకృష్ణ, నాగార్జున, మహేంద్ర, షాన్బాషా, మౌలాలి, శ్రీహరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.