కావలి, మహాత్మా జ్యోతిరావు పూలె 190 వ జయంతి సందర్బంగా ఆర్టీసి స్టాండ్ వద్దగల పూలే విగ్రహానికి జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇంచార్ అళహరి సుధాకర్ నాయకులు, వీర మహిళలలతో కలిసి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలె 190 వ జయంతి వేడుకలు ప్రతీ ఒక్కరు జరుపుకోవాలని వారు అస్పృశ్యతను, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రతీ ఒక్కరు విద్యాను అభ్యసించాలని మొట్టమొదటి మహిళా పాఠశాల స్థాపించిన సామాజిక కార్యకర్త. వారి ఆశయాలకు తగ్గట్లుగానే మా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలలో మొదటిది కులాలను కలిపే ఆలోచనా విధానఒ అని తెలిపారు. వీరి ఆశయ సాధనే ధ్యేయంగా మేము పనిచేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమములో కావలి టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి, మత్స్యకార రాష్ట్ర కార్యదర్శి శ్రీను, కో-ఆర్డినేటర్ సుధీర్, ఐటి కో-ఆర్డినేటర్ బాలు, నాయకులు మస్తాన్, ఆగస్టీన్, కళేబు, మండా శ్రీను, సాదు శ్రీధర్, పవన్, గోవిందు, అరుణ్, కిరణ్, దినకర తేజ, వెంకయ్య బాబు, వెంకయ్య, వెంకటేశ్వర్లు, గిరి, రాంబాబు మరియు వీర మహిళలు కొప్పుల లక్ష్మి, ఎజ్జా లక్ష్మి, ఇంటూరి లక్ష్మి ప్రసన్న, పద్మ, మాధురి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment