అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అళహరి సుధాకర్

కావలి నియోజకవర్గం: జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్, కాంప్లిక్ట్ మానేజిమేంట్ హేడ్ అజయ్ కుమార్ ను మంగళవారం హైదరాబాద్ లోని వారి స్వగృహంలో కలిసి వారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చము ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కావలి నియోజకవర్గం ఇంఛార్జి అళహరి సుధాకర్. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కావలిలో నూతనంగా ప్రారంభించబోతున్న జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ భారీగా చేస్తామని కావున తప్పక హాజరు కావాల్సిందిగా ఆహ్వానించానని వారు త్వరలో అన్ని హంగులతో పూర్తి నియోజక వర్గ పార్టీ ఆఫీస్ తయారు చేస్తున్నామని వారికి చెప్పడము జరిగింది. తప్పక హాజరు అవుతారని మాట ఇవ్వడము జరిగింది. కావలి రాజకీయాలు వాటి సమీకరణాల గురించి చాలా సేపు చర్చించుకున్నామని, కావలిలో ఈ సారి విజయావకాశాలు మనకు మెండుగా ఉన్నాయి తప్పక గెలుస్తాము అని అజయ్ గారు వారి కున్న వివరాలను బట్టి చెప్పారు. తరువాత కావలితో వారికి ఉన్న అనుభాధం, పరిచయాల గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.