పట్టభద్రులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయెల్‌ తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా ఉన్న ఓటరు జాబితాను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవద్దని సంబంధిత ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరు కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని చెప్పారు. అక్టోబరు 1 నుంచి నవంబరు 6వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులైన, తత్సమానమైన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన(నవంబరు 1, 2020కి మూడేళ్ల ముందు) వారందరూ అర్హులేనని ఆయన తెలిపారు.