మహిళలంతా వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు మార్చాలి: లోకం మాధవి

  • లోకం మాధవి ఆధ్వర్యంలో “మహిళా శక్తి”
  • జనసేన నాయకురాలు లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: భోగాపురం మండలంలోని మీరాకల్ కళాశాలలో శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో “మహిళా శక్తి” కార్యక్రమం శనివారం ఉదయం
వీరామహిళల నడుమ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం నలమూలల నుండి ఎంతో మంది వీర మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళ జనసేన నేతలు అయన కిరణ్ ప్రసాద్ మరియు త్రివేణి, తుమ్మి లక్ష్మి రాజు అతిధులుగా హాజరు అయ్యారు. వీరమహిళలు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిర్వహించిన లోకం మాధవికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ.. మహిళలు వచ్చే ఎన్నికల్లో ఒక శక్తి గా మారి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు మార్చాలి అని, రాజకీయాలు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సమస్యలు వచ్చాయని వైద్య రంగం, వ్యాపార రంగం ని ప్రభుత్వం పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఈ సమస్యలన్నీ పోయి ప్రజా పాలన చేస్తే జనసేన ప్రభుత్వం రావాలి అంటే ఒక ఓటుతోనే మహిళలందరూ సమాధానం చెప్పాలని తెలిపారు.