పొత్తులపై వైసిపి నాయకుల మాటలు అర్ద రహితం: రాయలసీమ జనసేన

పొత్తుల వైసిపి నాయకుల మాటలు అర్ద రహితం అని, వాళ్ళు ఎం మాట్లాడుతున్నారో వాళ్ళకే ఎరుక అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. ‌బుధవారం కమ్మవీధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల, జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర మాట్లాడారు.
ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ విధానంపై తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్వతిరేక ఓటు చీలకుండా కలిసి వచ్చే వారితో పొత్తు వుంటుందని పవన్ కళ్యాణ్ చెబితే దానిపై పెడార్థాలు తీసుకుని చేసే విమర్శలకు తాము కూడా సమాధానం చెప్పగలమని అన్నారు. ‌ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్, గజ్జెలు రెడ్డప్ప, ప్రదీప్ కుమార్ రెడ్డి, గ్రానైట్ బాబు, మారప్ప నాయక్, శివ, ఆనంద్ సాయి, నాగ, శంకర, సంజీవ్, మూర్తి, అంజి, జయనారాయణ తదితరులు పాల్గొన్నారు. ‌