వరద ఉద్ధృతి కారణంగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత
కృష్ణా, ఉప నదులు మలప్రభ, ఘటప్రభల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1,41,389 క్యూసెక్కులు చేరుతుండటం, వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) మార్గదర్శకాల మేరకు కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేసింది. దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు…
వదిలేస్తున్నారు. ఆ ప్రవాహం నారాయణపూర్ డ్యామ్లోకి చేరుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్ను ఖాళీ చేస్తూ దిగువకు 1,87,678 క్యూసెక్కులు వదలడం జరిగినది.
ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.
అప్పర్ తుంగ, భద్ర డ్యామ్లు నిండటంతో వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 49.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 51 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండిపోతుంది.