అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడంతో పాటు ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం నియోజవర్గం ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పిఠాపురం పట్టణ స్థానిక రథాలపేట, పశువుల సంత, పిఠాపురం మండలం రాపర్తి, పి.రాయవరం, చిత్రాడ, పిఠాపురం టౌన్ ఇంద్రనగర్, యు కొత్తపల్లి మండలం యండపల్లి జంక్షన్ వాకతిప్ప ప్రాంతాల్లో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి పాల్గొని అంబేద్కర్ కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడం తోపాటు అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయన పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్ని తాను నమ్ముతానని, జీవితం సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలని ఆయన నమ్మారు. కులమత బేధాలు లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి వైవిధ్యమైనదని, విభిన్న సంస్కృతులు కలిగిన భారత దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మరియు భారత ఔనత్యం ప్రపంచానికి తెలిసేలా భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కి మనమందరం కృతజ్ఞులమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే చెందినవాడు కాదు ఆయన అందరివాడని, ఆయన్ను ఒక్క కులానికో వర్గానికో పరిమితం చేసే కుట్ర కొంతకాలంగా జరుగుతుందని, అలాగే ప్రతి గుడిసెకు, ప్రతి పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిన నాడే అంబేద్కర్ కల సాకారమవుతుందనీ పేర్కొన్నారు. ఆయన వేసిన బాటలో భారత యువత అంతా నడిచి దేశన్ని ప్రతి రంగాన్ని ప్రగతి పథంలో నడిపించాలని యువతకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాశరావు, గౌరవ అధ్యక్షులు వేణు నారాయణ రావు, గోపు సురేష్, చిత్రాడ ఎంపిటిసి దూలపల్లి రత్నం, దేశిరెడ్డి సతీష్, మాదేపల్లి పద్మరాజు, దువా వీరబాబు, సిరిపిరెడ్డి గణేష్, దొడ్డి దుర్గాప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థులు దడాల దుర్గాప్రసాద్, స్వామి రెడ్డి సుబ్రమణ్యం, కసిరెడ్డి నాగేశ్వరరావు, మైనా బత్తుల చిన్న, కంద సోమరాజు, పెద్ది రెడ్ల భీమేశ్వరరావు, డకే ప్రసాద్, వేల్పుల చక్రధర్, పసుపులేటి గణేష్, బొజ్జ కుమార్, పిట్ట చిన్న, అల్లం కిషోర్,గంట బాబి, గొల్లపల్లి గంగ, అడబాల స్వామి, బావిశెట్టి నందీశ్వరరావు, పబ్బినిడి దుర్గాప్రసాద్ నామ శ్రీకాంత్, నామా సాయి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.