వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమదాలవలస జనసేన

ఆమదాలవలస, భారత ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆమదాలవలస నియోకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ లో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానంద స్వామి భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారని యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నాయకులు సిర్లపు గణేష్, రాఘవ
సరుబుజ్జిలి మండల నాయకులు పైడి మురళీ మోహన్, కుప్పిలి హరిబాబు, పాల్గొన్నారు.