ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికునికి అండగా అమలాపురం జనసేన

అమలాపురం రూరల్ లో ఇటీవల మృతి చెందిన రంగాపురం గ్రామ జనసైనికుడు సమనస వీరబాబు కుటుంబానికి చిండాడగరువు జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ పిల్లా రవి, నల్లా శ్రీధర్ 5,000 మరియు గ్రామ జనసేన నాయకులు, జనసైనికుల అధ్వర్యంలో 22,000 మొత్తాన్ని మండల జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు, యాళ్ళ నాగ సతీష్, మామిడిపల్లి దొరబాబు సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగింది. యాళ్ళ సతీష్ మాట్లాడుతూ వీరబాబుకి ఇద్దరు కుమార్తెలు అందులో ఒక కుమార్తె చదువు నిమిత్తం సంవత్సరానికి 5 వేల రూపాయలు అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వాకపల్లి శ్రీను, వాకపల్లి వెంకటేశ్వరావు, పరమట చిట్టిబాబు, నందుల సత్తిబాబు, కొలిశెట్టి తాతాజీ, మంచిగంటి మాచరావు, మండేలా గోపి, మాదిరెడ్డి దుర్గ మరియు జనసైనికులు పాల్గొన్నారు.