శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న అమంచి స్వాములు

అనంతపురం జిల్లా, ముక్కపట్నం నందు ఆదివారం శ్రీ కృష్ణ దేవరాయ విగ్రహ ఆవిష్కరణ వేడుకకు విచ్చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమంచి స్వాములుకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర మరియు జిల్లా బలిజ సంఘ నాయకులు. ఈ విగ్రహ ఆవిష్కరణ వేడుకలలో శ్రీ కృష్ణ దేవరాయ ఔనత్యాన్ని, ధీరత్వంను వారి లక్షణాలను కాపు తెలగ బలిజ సామాజికవర్గాలు ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. మరియు బలిజ సంఘ మీటింగ్ కు హాజరై కులాల ఐక్యత అని కులాలని కలుపుకొని రాజ్యాధికారం ఎన్నికలకు సంసిద్ధం కావాలని దిశ నిర్దేశం చేశారు. స్వాములుకి సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగినది.