బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

బొబ్బిలి నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యకమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి హాజరయ్యారు. బాబు పాలూరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్ని వర్గాల వారికి అంబేద్కర్ ఆదర్శం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నాయకులు అక్కివరపు మోహన్ రావు, జనసేన మండల అధ్యక్షులు సంచాన గంగధర్, మరడాన రవి మరియు ముఖ్య నాయకులు శంబన హరిచరణ్, మహంతి ధనంజయ్, పల్లెం రాజా, చీమల సతీష్, సతివాడ సత్య, బొన్నాడ గణేష్, జాన్, రామకృష్ణ, నరేష్, జగన్, సాయి, కిరణ్, రవి పారాది జనసేన ఎంపిటిసి అభ్యర్థి బంటుపల్లి దివ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హాక్కు కల్పించిన వ్యక్తి మహానీయుడు అంబేద్కర్ అని మాట్లాడారు. వీరమహిళ రమ్య తదితరులు పాల్గొన్నారు.