అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, జిల్లెల్లపేటలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఐ పోలవరం మండలం పితాని వారి పాలెం గ్రామానికి చెందిన యనమదల సత్యనారాయణను పరామర్శించారు. వారితో మోకా బాల ప్రసాద్, గంజా యేసు, పిల్లి గోపి, కొప్పిశెట్టి రాంబాబు, సంసాని పాండురంగారావు, బీమాల సూరి, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.