అంబేద్కర్‌ ఆశయాలు మన మదిలో చిరస్థాయిగా ఉంటాయి: బొమ్మిడి నాయకర్

  • డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మరియు నరసాపురం పట్టణం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నేడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం మన మదిలో చిరస్థాయిగా ఉంటాయని ఆయన బాటలోనే పయనిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు.. ఆ మహానుభావుడు భౌతికంగా లేనప్పటికీ వారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తి నేడు భారతదేశంలోని ప్రజలందరూ కూడా వివిధ వర్గాలుగా జీవిస్తున్నారు.. ఆ రాజ్యాంగ ఫలాలే ఈ రోజున ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి అని అన్నారు. వారు ఇచ్చిన రాజ్యాంగం అమలయ్యే విధంగా ప్రజలందరూ కూడా సమాన హక్కులు కలిగే విధంగా జనసేన పార్టీ నుండి స్ఫూర్తి తీసుకోవాలని అందరూ దానికీ అనుగుణంగా పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, బందెల రవీంద్ర, ఇంజేటి దానం, ఆకుల వెంకటస్వామి, తోట నాని, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సాంబ, దుసనపుడి సత్యనారాయణ, బెల్లంకొండ నాయుడు, పసుపులేటి అభి, గణేశ్న శ్రీరామ్, అడ్డాల బాబీ, కొల్లా బత్తుల సుందర బాబు, వాటాల రామారావు తదితరులు పాల్గొన్నారు.