అంబేద్కర్ కు పిడుగురాళ్ల జనసేన ఘననివాళి

గురజాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, న్యాయవాది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ పిడుగురాళ్ల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ నందు ఉన్న మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అంకారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన హక్కులను కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ని ఒక వర్గానికి నాయకుడిగా చిత్రీకరించి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నాయని తెలియజేశారు. అంబేద్కర్ ప్రపంచ నేతగా, భారత జాతి మార్గ నిర్దేశకులుగా జనసేన పార్టీ భావిస్తోందన్నారు ఓటు అనే ఆయుధంను మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలియచేసాడు. జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా మాట్లాడుతూ… రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయ సాధన ఒక జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల పైబడిన కూడా తాడిత పీడిత ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారంటే దానికి కారణం చిత్తశుద్ధిలేని ప్రభుత్వాల వైఫల్యం వల్లనే అని ఆయన అన్నారు.మరణించిన కౌలు రైతులకు 1లక్ష రూపాయలు ఇచ్చి వారి కుటుంబంకి దైర్యం నింపిన అంబేద్కర్ వాది పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు దూదేకుల శ్రీను, మట్టం పరమేష్, ఎస్.కె మదీన, పామిశెట్టి సాయి, వంశీ, బేతంచెర్ల సూరి, శ్రీనివాసరావు (దాసు), సామెలు, అబ్దుల్ గఫూర్, రాజేష్ సుభాని, సైదా, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.