క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అమ్మిశెట్టి వాసు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, తూర్పు నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులు, డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, ధార్మిక కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు.