క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద బీమా చెక్ అందజేత
విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలం, మరడం గ్రామం క్రియశీలక జనసైనికుడు కొన్న గౌరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా నాయకులు, గౌరు క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నందున ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం, స్థానిక నాయకులను నుంది సమాచారం సేకరించి తీసుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, గాయపడిన కార్యకర్త యొక్క కుటుంబానికి 50వేల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులకు పంపించి కొన్న గౌరు కుటుంబసభ్యులకు అందజేయవలసినదిగా సూచించారు.. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, గజపతినగరం నాయకులు మర్రపు సురేష్ కొన్న గౌరు నివాసానికి వెళ్ళి బీమా చెక్కును అందించారు. రాబోయే మూడో విడత సభ్యత్వం నమోదులో గ్రామాల్లో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/328446091_756208868888770_4147593089687133154_n-1024x768.jpg)