బొర్రాను సన్మానించిన నాదెండ్ల మిత్ర బృందం

సత్తెనపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సత్తెనపల్లి నియోజకవర్గం కొమెరపూడి నుండి నకరికల్లు మండలం చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయం వరకు మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి ఐదు రోజులు శ్రీరాజశ్యామల యాగం నిర్వహించిన సంకల్ప దీక్షాపరుడు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు తలపెట్టిన రాజశ్యామల యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసైనికులు వెంకట అప్పారావుకు చిరు సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిలక పూర్ణ, షేక్ ఖాసిం, షేక్ రఫీ, షేక్ యునీస్ తదితరులు పాల్గొన్నారు.