మండలంలో అత్యధిక సభ్యత్వాలు చేసిన కుంచా అంజిబాబుకి సన్మానం

మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో మాడుగులనియోజకవర్గం కె.కోటపాడు మండలంలో అత్యధిక సభ్యత్వాలు చేసినందుకుగాను కుంచా అంజిబాబుకి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా పార్టీకి ఇదేవిధంగా పనిచేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ, ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.