మంత్రి విశ్వరూప్ ఛాలెంజ్ స్వీకరించిన అనందరావు

  • నీవు వ్యక్తిత్వంపై మాట్లాడుతున్నావు
  • అసలు వ్యక్తిత్వం లేని వ్యక్తివి

కోనసీమ జిల్లా: గురివింద మాదిరిగా నీవు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నీ వ్యక్తిత్వం మీద నాది చాలా గొప్పది. ఎవరికయినా ఉపకారం చేసాను తప్పఅపకారం చేయలేదు. నీవు ఎంత మందిని ఇబ్బంది పెట్టావో అందరికి తెలుసు అంటూ మంత్రి విశ్వరూప్ పై టిడిపి అభ్యర్థి అయితా బత్తుల అనందరావు మండిపడ్డారు. స్థానిక శుభ గృహ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. ఈ ఎన్నిక విశ్వరూప్ వ్యక్తిత్వం పైన, ఆనందరావు వ్యక్తిత్వం పైన జరుగుతుందని అనడం తనకు ఆశ్చర్యాన్ని గురి చేసిందన్నారు. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఎన్నో లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాను అనడం, అలాగే మంత్రిగా పనిచేసిన విశ్వరూప్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అబద్ధపు మాటలు చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను మోసగించారన్న విషయం ప్రజల గ్రహించాలన్నారు. ఎందుకంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నాకు ఓటేయండి అని అడగాలి గాని నా వ్యక్తిత్వాన్ని చూసి ఓటెయ్యండి అనడం వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేదని అర్థం అవుతుందని అన్నారు. విశ్వరూప్ సవాళ్లను తప్పక స్వీకరిస్తానని ఎందుకంటే అమలాపురం నియోజకవర్గ ప్రజలకు ఆనందరావు వ్యక్తిత్వం ఏంటో తెలుసునన్నారు. తాను గెలిచిన తరువాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమం లో మెట్ల రమణబాబు, అల్లాడ స్వామి నాయుడు, పెచ్చేట్టి విజయలక్ష్మి, జనసేన నాయకులు కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.