ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 24 వ రోజు కార్యక్రమం

సర్వేపల్లి: ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని ముసునూరి వారి పాలెం బిట్-1 గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి ఏవిధంగా కృషి చేస్తుందని తెలియజేసి, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయిన గాజుగ్లాసు కు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారకార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ మేము నేలటూరు ఏపీ జెన్కో సంస్థ వారు స్థానికులకు, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. ఆ సంస్థ వారు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఇప్పుడు ఇవ్వకుండా మోసం చేసారని మాకు న్యాయం చేయాలని వారి ఆవేదనని స్థానిక జనసేన పార్టీ నాయకులకు తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు నేలపూడి కళ్యాణ్, తాండ్ర శ్రీను, మనుబోలు మాధవ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.