ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం కార్యక్రమం 34వ రోజు
సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కోళ్లమిట్ట గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 34వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, కోళ్లమిట్ట గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి జరగాలన్నా, సామాన్యుడికి న్యాయం జరగాలన్నా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. వ్యవస్థలో మార్పు కోసం, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసుకు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎంని చేసుకుందాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గణపతి, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-19-at-5.29.06-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-19-at-5.29.06-PM-1-1024x581.jpeg)