క్రిస్మస్ సందర్భంగా జనసేన పార్టీ తరుపున సింగరాయకొండలో అన్నదాన కార్యక్రమం

క్రిస్మస్ పర్వదిన సందర్భంగా సింగరాయకొండ రైల్వే రోడ్డు, బస్టాండ్, కందుకూరు రోడ్డులోని అనాధలకు మరియు యాచకులకు ఆహారం ప్యాకెట్ల రూపంలో అందించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు యన్నం రాము, పోకల రవీంద్ర, మంచాల షణ్ముఖి, పాడే సురేష్, రానా, నాగార్జున, చెన్నంశెట్టి సాంబ, అడుసుమల్లి భరత్, గుండ్రెడ్డి భరత్, గోరంట్ల కళ్యాణ్, నవీన్, సమయం సాయి, శ్రీను, రాజ, బింగినపళ్లి మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.