తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. కాగా, చేగుంట మండలంలోని 3 గ్రామాలు, యెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు మొత్తంగా 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్ పాటు చేస్తున్నారు. నూతన మండలం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.