అంతర్వేది ఘటన కేసు సీబీఐకి అప్పగింత

ఏపి లో కలకలం రేపుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ డీజీపీని ఆదేశించారు.

అంతర్వేది రథం అగ్నికి అహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉండటంతో, కేసు దర్యాప్తును ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్నారు. కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు సిబిఐకి డిమాండ్ చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ.. రేపు రాష్ట్ర ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.