అంతర్వేది నరసింహస్వామి నూతన రథాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌

సఖినేటిపల్లి (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన రథం ప్రారంభోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నూతన రథాన్ని సిఎం ప్రారంభించారు. తొలుత హెలీప్యాడ్‌ వద్దకు వచ్చిన సిఎం కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బిసి వెల్ఫేర్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపి చింతా అనురాధ, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.