ఉపాధ్యాయ బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఇటీవలే ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిందే.  ఈ నేపధ్యం లొ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులను బదిలీలకు అవకాశం కల్పించింది. బదిలీ దరఖాస్తులను ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనుంది. ఇటీవలే టీచర్ల బదిలీలకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. సంబంధిత దస్త్రంపై ఆయన సంతకం చేశారు. సీఎం ఆమోదం నేపథ్యంలో తాజాగా బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి అర్హులుగా ప్రభుత్వం తేల్చింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టనుంది.