“ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్” 4వ రోజు జనసేన విజయ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గం: “జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 4వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో బావి సెంటర్ ఎస్ టి కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా త్రాగు నీరు సమస్య, డ్రైనేజ్ కాలువల సమస్యను మహిళలు వినుత దృష్టికి తీసుకుని రావడం జరిగింది. కొంత మందికి పథకాలు ఎర వేస్తూ, నిత్యావసర ధరలు పెంచి సామాన్యులు బ్రతకలేని స్థితి అని భాదను వ్యక్తం చేశారు. తప్పకుండా అక్కడి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. పరిష్కరించని యెడల అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించాలని, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరడం జరిగింది.