ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 41వ రోజు

  • 41వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, చోడవరం పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. గ్రామస్థులు వినుత కోటాకి బాణసంచా, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంకి వెళ్ళే ప్రధాన మార్గం అస్తవ్యస్తం గా ఉందని, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, నాయకులు సురేంద్ర, కంచి చందు, దండి రాఘవయ్య, కావలి శివకుమార్, తోట గణేష్, జ్యోతి రామ్, పేట చిరంజీవి, శారద, లక్ష్మి, కవిత, హేమంత్ గౌడ్, చిన్న మునయ్య, రాజేష్, సురేష్, ఉదయ్, జనసైనికులు దినేష్, బన్నీ, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.