ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్- జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 17వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పెన్నల పాడు పంచాయతీ లోని పెన్నల పాడు, పెన్నలపాడు హరిజన వాడ గ్రామాలలో శనివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామానికి వెళ్ళే రోడ్డు విపరీతంగా అక్రమంగా ఇసుక తరలించడం తో పాడైందని, సి. సి. రోడ్లు, స్ట్రీట్ లైట్లు లేవని డ్రైనేజ్ కాలువలు సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, లక్ష్మి, రాజ్య లక్ష్మి, రాజేష్, సురేష్, దినేష్, జ్యోతి రామ్, జనసైనికులు జగదీష్, జానికి రామ్, పొన్నేశ్, గురుమూర్తి, అభిషేక్, హేమంత్, బబ్లూ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.