ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర – 37వ రోజు

  • 37వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి పట్టణంలో 9వ వార్డు, పి.వి స్ట్రీట్ నందు గురువారం పట్టణ ప్రధాకార్యదర్శి పేట చిరంజీవి ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రేన్ ద్వారా గజమాల, బాణసంచాతో పట్టణ నాయకులు, జనసైనికులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది.
డ్రైనేజ్ కాలువలు నిర్మాణం, పారిశుధ్యం సమస్యలు, స్ట్రీట్ లైట్లు, నిత్యావసర ధరలు పెంపు, ఇళ్ళ స్థలాల గురించిన సమస్యలను వినుత దృష్టికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, నాయకులు శారద, గాయత్రి, పుష్ప, రాజేష్, సురేష్, రాజ్య లక్ష్మి, కవిత, తదితరులు పాల్గొన్నారు.