ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 25వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పూడి పంచాయతీలోని పూడి, పూడి అరుంధతి వాడ, పూడి హరిజన వాడలో మంగళవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొని, వినుతకి ఆహ్వానం పలికారు. గ్రామాల్లో త్రాగు నీరు, సి. సి రోడ్లు, ఇంటి పట్టాలు అర్హులకు అందలేదు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ కాలువలు, పారిశుధ్యం సమస్యలు, డప్పు కళాకారుల ఇబ్బందులు వినుత గారికి తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు తోట గణేష్, పేట చిరంజీవి, కవిత, శారద, రాజ్య లక్ష్, లక్ష్మి, సురేష్, మునయ్య గురవయ్య జనసైనికులు దినేష్, బత్తెయ్య, మోహన్, తులసీ, గోపి, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.