ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోండి: శ్వేతా మహంతి

తెలంగాణా లో జేఎస్‌ఎస్‌యూఆర్‌ పథకాల కింద జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలో పేర్లు నమోదు చేసుకున్న వారు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ శ్వేతా మహంతి ఒక ప్రకటనలో తెలిపారు. బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్‌ చెల్లించి ఇళ్లు పొందని వారు తమ ఆధార్‌ కార్డు, కాంట్రిబ్యూషన్‌ చెల్లించిన వివరాలతో కలెక్టరేట్‌లో ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు హౌజింగ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లను ఫోన్‌ నంబర్‌ 040-23202113 సంప్రదించాలని సూచించారు.