కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా గాది రాంబాబు నియామకం

జగ్గంపేట నియోజకవర్గం: గోకవరం మండలం, రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన గాది రాంబాబు జగ్గంపేట నియోజకవర్గ కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా నియమకంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కమిటీ ఆదేశాలను అనుసారం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మరియు కాకినాడ జిల్లా ఇన్చార్జ్ మలకల సూర్య ప్రభాకర్ రావు చేతుల మీదుగా వారికి నియామక పత్రాన్ని అందజేశారు. కాపు సంక్షేమ శాఖ ఉపాధ్యక్షులుగా నియామకమైన రాంబాబు జనసేన పార్టీలో సీనియర్ నాయకులు పనిచేస్తున్నారు. కాపు ఐక్యత వేదికగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. వారికి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి కాపు సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉపాధ్యక్షులుగానియామకమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అభ్యున్నతి దిశగా కమిటీ పనిచేస్తుందని వారి అభిలాష మేరకు తమకు అప్పజెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. తమపై ఎంతో నమ్మకముంచి కాపు సంక్షేమ సేన కమిటీలో ప్రధాన బాధ్యతలు అప్పగించడంతో హర్షం వ్యక్తం చేశారు. తమకు సముచిత స్థానం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కాపు ఐక్యత వేదిక నుంచి సోదర సమానులైన రాంబాబుకి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో చల్లా రాజ్యలక్ష్మి, కుంచె రామకృష్ణ, సుంకర శివ తదితరులు ఉన్నారు.