సింగనమల నియోజకవర్గం జనసేన కమిటీల నియామకం

అనంతపురం జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల కమిటీ నియామకం ఏవిధంగా పూర్తి చేయాలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్ సూచనల మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సింగనమల నియోజకవర్గం జనసేన కమిటీల ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్న కార్యకర్తలను గుర్తించి వారికి మండల కమిటీలలో స్థానం కల్పించడం జరిగింది. అలాగే కౌలు రైతుల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనంజయ, చంద్రశేఖర్, పురుషోత్తం రెడ్డి, శ్రీమతి విజయమ్మ, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు ఎర్రిస్వామి, అరటి తాహిర్, సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, పుట్లూరు మండల అధ్యక్షులు వినోద్, నార్పల మండల అధ్యక్షులు రామకృష్ణ, దిన్నె మండల అధ్యక్షులు ఎర్రితాత, ఎల్లనూరు మండల అధ్యక్షులు చిన్న శ్రీరాములు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.