జనసేన పార్టీ ఎల్కతుర్తి మండల కమిటీ నియామకం

హుస్నాబాద్: జనసేన పార్టీని హుస్నాబాద్ నియోజకవర్గంలో బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండల కమిటీని నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన రాజకీయ విప్లవానికి జనసేన బీజం వేసిందన్నారు. సామాన్య యువతను నాయకులుగా మారుస్తూ జనసేన రాజకీయం చేయబోతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్ది పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అన్నారు. ముందు ముందు గ్రామ స్థాయిలో కమిటీలు వేసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నూతన కార్యవర్గం అధ్యక్షులు కల్లెపు అజయ్, ఉపాధ్యక్షులు మేకల కిషన్, ప్రధాన కార్యదర్శి చెల్పూరి వినోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మండ శ్రావణ్, బండారి రణధీర్, సెక్రటరీ ఇలాసాగరం ప్రశాంత్, చెల్పూరి కుమారస్వామి, సోషల్ మీడియా సెక్రటరీ మండ సంతోష్, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ బుర్ర అజయ్, బాడిష నవీన్, అల్లి కార్తీక్, మర్రిపెల్లి రమేష్, గడిపే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.