జనసేన పార్టీ సైదాపూర్ మండల కమిటీ నియామకం

హుస్నాబాద్ నియోజకవర్గం: జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు సైదాపూర్ మండల కమిటీని నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన రాజకీయ విప్లవానికి జనసేన బీజం వేసిందన్నారు. సామాన్య యువతను నాయకులుగా మారుస్తూ జనసేన రాజకీయం చేయబోతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్ది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అన్నారు. రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో కమిటీలు వేసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ పొడిశెట్టి విజయ్, వైస్ ప్రెసిడెంట్ రుద్రారపు అరుణ్, జనరల్ సెక్రెటరీ మద్ది స్వామి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గాదపాక ప్రశాంత్, బత్తుల శ్రీను, సెక్రెటరీ రామగిరి రాజు, సోషల్ మీడియా సెక్రెటరీ మొలుగూరి అరవింద్, ఎక్జిక్యూటివ్ మెంబర్స్ బత్తుల రాజు, సంగాల మహేష్, పొడిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.