అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామకమిటీ నియామకం

పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామకమిటీ వెయ్యటం జరిగింది. మండల అధ్యక్షుడు తోట రవి సమక్షంలో గ్రామ అధ్యక్షునిగా మద్దిపాటి పోసిబాబు, ఉపాధ్యక్షుడుగా కోకూరి నాగరాజుగ, ప్రధాన కార్యదర్శిగా దాసరి వినోద్ కుమార్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడి పిండి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ నాయకులు అప్పన ప్రసాద్, మాదేపల్లి శ్రీనివాస్, ఏపురి సతీష్, మేడిన కన్నయ్య, ఎం.గంగాధరరాజు, దాకారపు మధు, అల్లం రాజు, సాయి మరియు అత్యధికంగా జనసైనికులు పాల్గొన్నారు.