జనసేన పార్టీ కోహెడ మండల కమిటీ నియామకం

హుస్నాబాద్: జనసేన పార్టీని హుస్నాబాద్ నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు కోహెడ మండల కమిటీని నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ గురువారం నియమించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన రాజకీయ విప్లవానికి జనసేన బీజం వేసిందన్నారు. సామాన్య యువతను నాయకులుగా మారుస్తూ జనసేన రాజకీయం చేయబోతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్ది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అన్నారు. ముందు ముందు గ్రామ స్థాయిలో కమిటీలు వేసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ శ్రావణపల్లి శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ జేరిపోతుల విద్యాసాగర్, జనరల్ సెక్రెటరీ వేల్పుల మధు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆకుబత్తిని రాకేష్, సెక్రెటరీ వేల్పుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.