కైకలూరు మండల అధ్యక్షులుగా పోకల దేవేంద్ర గోపాల కృష్ణ నియామకం

ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ ఆదేశాలతో.. ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో.. మంగళవారం కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కోర్ కమిటీ అంతా కలసి పోకల దేవేంద్ర గోపాల కృష్ణ (కృష్ణ) ను మండల గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కైకలూరు నియోజకవర్గ కోర్ కమిటీ, ముదినేపల్లి మండల జనసేన కార్యవర్గం, జనసైనికులు పాల్గొన్నారు.