రామగుండం జనసేన మండల కమిటీ నియామకం
రామగుండం, జనసేన పార్టీ రామగుండం మండలం కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. అధ్యక్షులుగా మేకల రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఏముర్ల రంజిత్ నియమించినట్లు రామగుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ మూలా హరీష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని రామగుండంలో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతామని త్వరలో గ్రామ కమిటీ కూడా నియమిస్తామని అన్నారు. నా నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-22-at-20.27.33-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-22-at-20.27.32-683x1024.jpeg)