గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శిగా “ఉప్పు వెంకట రత్తయ్య” నియామకం

గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శిగా ఏటుకూరు గ్రామానికి చెందిన ఉప్పు వెంకట రత్తయ్యను నియమించినారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తేలియజేసినారు. ఈసందర్భంగా వెంకటరత్తయ్యకు నియామక పత్రాన్ని జనసేన పార్టి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నాయుడు ద్వారా అందుకోవటం జరిగినది అని వెంకటరత్తయ్య సోమవారం నాడు ఒక ప్రకటనలో తేలియజేశారు గతంలో యన్.యస్.యు.ఐ పట్టణ కార్యదర్శి గాను, గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగాను, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గాను పనిచేయటం జరిగినదని వెంకటరత్తయ్య అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి పార్టిని ప్రజలకు చేరువైయే విధంగాను ప్రభుత్వం చేపట్టే తప్పుడు నిర్ణయాలను ఎండగడుతూ పార్టి నిర్మాణం కోరకు కృషి చేస్తానని వెంకటరత్తయ్య అన్నారు. నాకు ఈ పదవి రావటానికి కారకులైన రాష్ట మరియు జిల్లా నాయకులకు, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.