కృతజ్ఞతా సమావేశం..!

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ జనసైనికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ ప్రసంగిస్తూ, జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం మరియు మండల స్థాయిలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ నాయకత్వంలో సభకు హాజరైన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అందించినందుకు ఆయనకు మన్యం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గత 11 ఏళ్లుగా జనసేన కోసం నిరంతరంగా పోరాటం చేస్తోన్న ప్రతి జనసేన కుటుంబ సభ్యునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆవిర్భావ జయకేతనం సభలో, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పోలుస్తూ, ఆయన నాయకత్వం కేవలం భారతదేశ ప్రజలకు మాత్రమే కాకుండా, ఇతర దేశాల ప్రజలకూ ఆకర్షణగా మారిందని పేర్కొన్నారు. మన్యంలో ప్రజల కష్టాలను తీర్చే గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని అన్నారు. సభ విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరి కృషిని గుర్తిస్తూ, పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి కార్యకర్త, జనసైనికుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్ మత్స పుండరికం, టౌన్ నాయకులు కర్నేన సాయి పవన్, ఉదయాన చరణ్, సిరాపు నాగరాజు, పుప్పాల పురుషోత్తం, కోడివెంకట్ నాయుడు, పొగిరి జగన్, రౌతు నవీన్, రఘమండల గణేష్, మెడిద సందీప్, మజ్జి శ్రీనివాస్, కళ్యాణ్, వినోద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment