టిడిపి చేపట్టిన రాష్ట్ర బంద్ కు అరకు జనసేన మద్దతు

అరకు నియోజకవర్గం: అరకు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన బంద్ కు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, అరకు వేలి మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, గొల్లూరి అప్పారావు, శ్యామ్ తదితరులు సోమవారం జరిగిన బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా, ఆ ప్రజాస్వామ్య బద్దంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకి పంపడానికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్దతరహా వ్యక్తిని ప్రజాస్వామ్యం బద్దంగా అరెస్ట్ చేయకుండా, కక్షపూరిత రాజకీయముతో ఈ వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని తెలిపారు. ఇటువంటి ధోరణి ప్రతిపక్ష నాయకుల పట్ల జగన్ రెడ్డి నాయకత్వంలో అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి అరెస్టులకు భయపడితే లేదని, రానున్న రోజుల్లో జగన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలుతిరగబడే రోజుల చాలా మెండుగా ఉన్నాయని తెలిపారు.